Wednesday, April 24, 2024

ట్రైనింగ్ తీసుకుంటున్న నివేదా, రెజీనా !!

సురేష్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో నివేద థామస్, రెజీనా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫిలిం ఛాంబర్ లో టైటిల్ కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఈ సినిమా కొరియన్ మూవీ కి సంబంధించిందిగా తెలుస్తోంది. గతంలో కొరియన్ సినిమా మిస్ గ్రానీ ని ఓబీ గా నిర్మించారు.

ఇప్పుడు 2017లో విడుదలైన కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్ సినిమాను శాఖినీ, డాకినీ గా తెరకెక్కించనున్నారు. ఇది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ ల కథ. తెలుగు నేటివిటీకి కొన్ని మార్పులు చేసి తెరకెక్కించబోతున్నారు. అలాగే ఇది యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమా కాబట్టి యాక్షన్ పార్ట్ కోసం ఈ ఇద్దరు కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.స్వామి రారా ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement