Wednesday, April 24, 2024

నితిన్ టు శర్వానంద్….వయా కృష్ణ చైతన్య ?

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా పవర్ పేట సినిమా తెరకెక్కబోతుందంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాలని డైరెక్టర్ భావించటంతో అందుకు చాలా టైం పడుతుంది అనే కారణంతో నితిన్ ఈ సినిమాను పక్కకు పెట్టాడట. అయితే తాజా సమాచారం ప్రకారం కృష్ణ చైతన్య ఈ సినిమాకోసం నితిన్ ప్లేస్ లో శర్వానంద్ ను సంప్రదించాడట. ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నారు.

1960 2021 మధ్య ఈ కథ ఉండనుందని అలాగే శర్వానంద్ మూడు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. 18 ఏళ్ల టీనేజ్ పాత్ర, రెండవది 40 ఏళ్ల వ్యక్తి, మూడవది 60 సంవత్సరాలు ముసలి వాడు గా కనిపించనున్నాడట. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలలో చేస్తున్నాడు శర్వానంద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement