Wednesday, April 24, 2024

నితిన్ మరో సినిమాని లైన్ లో పెట్టేశాడు ?

హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇటీవల చెక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్… ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే తాజాగా మరో సినిమాని కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది.

ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ దర్శకుడిగా మరెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నితిన్ కు ఓ స్టోరీ లైన్ చెప్పారట. అది నితిన్ కు కూడా నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వక్కంతం వంశీ సినిమా తరువాత వీరి చిత్రమే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఎస్.ఆర్.శేఖర్ గతంలో బిజినెస్ మాన్, టెంపర్ చిత్రాలకు ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వైపు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement