Wednesday, April 24, 2024

పవన్ తో నిత్యా మీనన్ రొమాన్స్… అఫీషియల్

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ నటిస్తుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ… నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ వారు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా, రానా ఆర్మీ మ్యాన్ గా కనిపించబోతున్నారు. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement