Thursday, March 28, 2024

న‌య‌న‌తార మ‌రో బిజినెస్.. మల్టిఫ్లెక్స్ నిర్మాణం

న‌టీ న‌టులు ప‌లు బిజినెస్ ల‌లో పెట్టుబ‌డులు పెడుతూ త‌మ సంపాద‌న‌ని పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. కాగా నయనతార హీరోయిన్ గా సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోంది. నయన్, విగ్నేష్ కలసి ఆ మధ్యన సొంత ప్రొడక్షన్ కూడా ప్రారంభించారు. నయనతార అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. తాజాగా నయన్ కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నయనతార థియేటర్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతునట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఆల్రెడీ స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. మహేష్ బాబు ఏఎంబి సినిమాలో భాగస్వామి. అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ నిర్మాణం జరుగుతోంది. నయనతార కూడా అదే తరహాలో విలాసవంతమైన, అత్యాధునికమైన మల్టిఫ్లెక్స్ ని చెన్నైలో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో మూతపడ్డ అగస్త్య థియేటర్ ని నయన్ కొనుగోలు చేసి దాని స్థానంలో కొత్త మల్టిఫ్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement