Friday, April 26, 2024

నారప్ప థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఆత్మహత్యాయత్నం చేసిన అభిమాని

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నారప్ప కూడా ఓటీటీ లో రిలీజ్ కాబోతుంది అని టాక్ నడిచింది.

అయితే ఈ సినిమాని థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయాలని ఓ అభిమాని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఏపీ లోని రేణిగుంట కు చెందిన సునీత అనే అభిమాని నారప్ప సినిమాను థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయాలని ఆత్మహత్య యత్నం చేయగా.. మరోవైపు వరంగల్ కు చెందిన కిరణ్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాడు. దీంతో సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement