Saturday, April 20, 2024

రిస్క్ తీసుకుంటున్న ‘అఖండ’

కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు నిలిచిపోతున్నాయి. మెగాస్టార్ ఆచార్య, వెంకటేష్ ఎఫ్3, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్ ఇలా చాలామంది స్టార్ హీరోలు తమ షూటింగ్ లను ఆపేస్తున్నారు. వారిలో అల్లు అర్జున్ కాస్త దూకుడుగా వ్యవహరించి… షూటింగ్ కంటిన్యూ చేసినప్పటికీ ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు అల్లుఅర్జున్. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా కూడా మొదట షూటింగ్ ను శరవేగంగా జరిపినప్పటికీ ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.

ఈనెల 13 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అతి తక్కువ మంది తో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొననుందట. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement