Wednesday, April 24, 2024

‘మరో మనం’ నందమూరి అభిమానుల కోరిక !!

నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి చాలామంది హీరోలు వచ్చారు. అందులో నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నిలదొక్కుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా కలిసి ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం అభిమానుల కల నెరవెరబోతుందట. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి తీసిన మనం సినిమాలానే నందమూరి ఫ్యామిలీ కూడా ఓ సినిమా చేయబోతున్నారట. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ,అఖిల్ లు నటించారు.

ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీకి రెడీ అవుతుందని తెలుస్తోంది. 2022 ఉగాది లోపు అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement