Friday, April 19, 2024

మసకబారిన ప్రతిష్ఠ…మళ్ళీ రావాలి !! నాగబాబు

మా అసోసియేషన్ ఎన్నికలలో ఈసారి ప్రకాష్ రాజు, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజు తన ప్యానెల్ సభ్యులతో మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ నటుడు శ్రీకాంత్, సమీర్, బెనర్జీ, అనసూయ, ప్రగతి, తనీష్, అజయ్, ఉత్తేజ్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ప్రకాష్ రాజు రెండు నెలల క్రితమే మా అసోసియేషన్ అభివృద్ధి గురించి చెప్పారని… ఆయన చెప్పిన మాటలు ఎంతో ముచ్చటేసిందని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని చెప్పినప్పటి నుంచి లోకల్ నాన్ లోకల్ అనే మాట తెరపైకి తీసుకు వచ్చారని సభ్యత్వం ఉంటే ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని… ఇదంతా అర్ధరహితమైన వ్యాఖ్యలు అని చెప్పుకొచ్చారు.

గత నాలుగేళ్లుగా మా ప్రతిష్ట మసకబారింది. కానీ ఈ సారి ఆ ప్రతిష్ట పెరిగే విధంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి అధ్యక్షుడు కావాలి అని చెప్పుకొచ్చారునాగబాబు. అంతేకాకుండా చిరంజీవి ఆశీస్సులు కూడా ఉన్నాయని, ప్రకాష్ రాజ్ కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement