Thursday, April 25, 2024

ముచ్చటగా ముగ్గురితో చైతూ!

లవ్ స్టోరీ నిసిమాతో బీజీగా ఉన్న అక్కినేని వారసుడు నాగచైతన్య వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. లవ్ స్టోరీ మూవీ  విడుదలకి ముస్తాబవుతోంది. దీంతో చైతూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ టచ్ ఉన్న ఈ కథకి ‘థాంక్యూ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో చైతూ రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఓ హీరోయిన్ గా రాశి ఖన్నాను ఫిక్స్ చేశారు. మిగతా ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్, మాళవిక నాయర్ లను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో చైతూతో మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్.. తాజా మూవీని కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్ స్టోరీ సినిమా ఈ నెల 16న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో సాయిపల్లవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చైతూ.

Advertisement

తాజా వార్తలు

Advertisement