Saturday, April 20, 2024

చై-సామ్ విడాకుల వార్తలు నిజమేనా..? భరణంగా 300 కోట్లు..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స‌మంత‌-నాగ చైతన్య విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్ద‌రి విడాకుల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇటు స‌మంత కాని అటు నాగ చైత‌న్య కాని స్పందించ‌క‌పోవ‌డంతో రోజు రోజుకి కొత్త వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. కానీ.. ఇటు నాగ చైతన్య గాని, సమంత గాని ఈ వార్తలపై పూర్తిగా ఓపెన్ అయ్యింది లేదు. సమంత రోజుకో రకమైన ట్వీట్ తో హింట్స్ ఇస్తున్నా, చైతూ వైపు నుండి ఆ మాత్రం ఇండికేషన్స్ కూడా లేవు. తాజాగా సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

మరోవైపు నాగచైతన్య “లవ్ స్టోరీ” మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. కానీ.., ఆ ప్రమోషన్స్ లో ఎక్కడా సమంత కనిపించడం లేదు. చైతూ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటూ వస్తున్నాడు. ఒక్కోసారి దర్శక, నిర్మాతలకి కూడా అందుబాటులో ఉండకుండా వస్తున్నాడట. మీడియా ముందుకి కూడా తన వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు అన్న కండీషన్ మీదే వస్తున్నాడట. దీంతో.. భార్యభర్తల మధ్య గ్యాప్ రావడం నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు, మీడియూ వర్గాలు, సాధారణ ప్రేక్షకులు అంతా ఫిక్స్ అయిపోయారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2లో స‌మంత చాలా బోల్డ్‌గా న‌టించ‌డంతోనే అసలు వివాదం మొద‌లైంద‌ని తెలుస్తుండ‌గా, చైతూ-సామ్‌ని చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిన ఎలాంటి ఫ‌లితం లేద‌ని స‌మాచారం. చై- సామ్ డివోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి కానుందని, స్థిర, చర ఆస్తులతో కలిపి సమంతకు భరణంగా 50 కోట్లు ఇవ్వ‌నున్నారని కొంద‌రు చెబుతుంటే మ‌రి కొంద‌రు 250 నుండి 300 కోట్ల వ‌ర‌కు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులోఎంత నిజ‌ముంద‌నేది తెలియాలంటే చైతూ- సామ్‌ల‌లో ఒక‌రు స్పందించిక త‌ప్ప‌దు.

ఇది కూడా చదవండి: అనుభ‌వించు రాజా టీజ‌ర్ విడుద‌ల చేసిన రామ్ చ‌ర‌ణ్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement