Thursday, April 25, 2024

పూనమ్ కౌర్ కు మైయాల్జియా.. కేరళలో ఆయర్వేద చికిత్స

నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధితో బాదపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి కట్టడి కోసం కేరళలో ఆయర్వేద చికిత్స తీసుకుంటోందంట. ఈ వ్యాది కారణంగా కండరాల నొప్పితో తరచూ పూనమ్ కౌర్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చికిత్స తీసుకోవడమే నయం అని భావించిందట. నిద్రలేమి, మానసిక సమస్యలు, జ్ఞాపకశక్తి చురుగ్గా పనిచేయకపోవడం, వాపు సమస్యలు వంటివి ఈ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మూవీ ‘శౌర్యం’లో పూనమ్ కౌర్ నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement