Wednesday, April 24, 2024

నా పేరు సూర్య డైరెక్టర్ తో నితిన్ కొత్త సినిమా

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇటీవలే రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అలాగే మంచి వసూళ్లను కూడా సాధించింది. అయితే ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు నితిన్. అందధూన్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇది షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను కూడా మొదలు పెట్టనున్నారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు నెలలో స్టార్ చేయబోతున్నారట. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా పేరు సూర్య చిత్రంతో నుంచి డైరెక్టర్ గా మారారు వంశీ. ఆ సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement