Saturday, April 20, 2024

సర్కారు వారి పాట సినిమా పాటలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన థమన్

అలా వైకుంఠపురములో సినిమా తో సూపర్ డూపర్ మ్యూజిక్ ని అందించి వరుస అవకాశాలనుఅందుకుంటున్నాడు ఎస్.ఎస్.థమన్. చిన్న సినిమా పెద్ద సినిమా అనే సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో థమన్ బెస్ట్ ఆప్షన్ అవుతున్నాడు. అరవింద సమేత ,మజిలీ ,అలా వైకుంఠపురములో, క్రాక్, వకీల్ సాబ్ ఇలా ప్రతి సినిమాకి మ్యూజిక్ పరంగా థమన్ బెస్ట్ ఇచ్చారు.

అలాగే ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన దూకుడు, బిజినెస్ మ్యాన్ సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ ఆరేళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. అయితే తాజాగా ఈ సినిమాపై స్పందించిన థమన్… ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. అందులో మూడు పాటలు కంప్లీట్ చేశాను. ఇంకా రెండు మిగిలి ఉన్నాయి. ఆల్బమ్ మొత్తం మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్స్ తో ఉండబోతుంది. అలాగే ఒక మసాలా ఐటెం సాంగ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు థమన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement