Tuesday, April 16, 2024

ముగ్గురు మొనగాళ్లు ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి ఆదరణ పొందారు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే.. కథానాయకుడిగా కూడా అప్పుడప్పుడు మెప్పిస్తున్నారు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్ము రా సినిమా లతో శ్రీనివాసరెడ్డి మంచి విజయాలను అందుకున్నాడు. తాజాగా ముగ్గురు మొనగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో శ్రీనివాస్ రెడ్డి ,దీక్షిత్ శెట్టి , వెన్నెల రామారావు ఒకే పోస్టర్ లో కనిపించారు. శ్రీనివాస్ రెడ్డి కి వినపడదు, దీక్షిత్ మాట్లాడలేడు. రామారావుకు కనపడదు.. ఇలా ఈ ముగ్గురు మొనగాళ్ళు తో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నాడు అభిలాష్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement