Saturday, April 20, 2024

రూ.100కోట్ల‌తో సినిమా.. రాజ‌కీయాల‌పై నో కామెంట్స్.. మోహ‌న్ బాబు

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు న‌టుడు మోహ‌న్ బాబు. వీఐపీ బ్రేక్‌ దర్శణంలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మంచి వాతావరణం ఉందన్నారు. ద‌ర్శ‌నం అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. వంద కోట్లతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఆ వివరాలు త్వరలో త‌న త‌న‌యుడు మంచు విష్ణు వెల్లడిస్తాడ‌ని అన్నారు. కాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మ్యాటర్‌ ఓపెన్‌ అయ్యారు. ఏపీలో రజనీకాంత్‌.. టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు హైదరాబాద్‌ ని చూస్తుంటే అమెరికాలో ఉన్నామా అనే ఫీలింగ్‌ కలుగుతుందని, దానికి కారణం చంద్రబాబే అని రజనీకాంత్‌ అన్నారు. ఇది వివాదంగా మారింది. కాగా అధికార వైసీపీ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించారు. రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అయితే రజనీకాంత్‌, మోహన్‌బాబు మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు మోహన్‌బాబు స్పందించలేదు. తాజాగా తిరుమలలో ఈ ప్రశ్న మోహన్‌బాబుకి ఎదురయ్యింది. రజనీకాంత్‌ వ్యవహారంపై మీరు మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించగా, తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని, రజనీకాంత్‌ గురించి మాట్లాడాలంటే రోజైనా సరిపోదని తెలిపారు. ప్రస్తుతం మోహన్‌బాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement