Wednesday, April 24, 2024

వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్న వెన్నెల కిషోర్ ?

వెన్నెల కిషోర్ మరోసారి దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో కిషోర్ వెన్నెల వన్ బై టు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికి దర్శకుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఈ సారి వెన్నెలకిషోర్ దర్శకత్వం వహించేది ఈ సినిమాకి కాదట… ఓ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించబోతున్నాడట.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దీనిని నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. దానికి దర్శకత్వం కోసం వెన్నెల కిషోర్ ను కోరారట. అంతేకాకుండా ఓ ముఖ్యమైన పాత్ర కూడాకిషోర్ ఇందులో పోషిస్తున్నాడట. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ను రూపొందించడం లో ఏమేర సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement