Thursday, March 28, 2024

ఉప్పెన డైరెక్టర్ తో మోక్షజ్ఞ ?

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే మొదట ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఇటీవల సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందట. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఇక మొదటి నుంచి కూడా ఆ సంస్థ పై ప్రత్యేకమైన అభిమానం ఉందట బాలయ్యకు. వారి కోరిక మేరకు ఈ సినిమా చూసి దర్శకుడు బుచ్చిబాబు ను అభినందించాట బాలయ్య. అయితే ఆ సంస్థ అధినేతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ లు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా నిర్మించే అవకాశం ఇవ్వాలని కోరాడట బాలయ్యను. ఇప్పటికే ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఆ కథను రెడీ చేసే పనిలో ఉన్నారట. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే బుచ్చిబాబుతో మోక్షజ్ఞ సినిమా ఉండనుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement