Saturday, April 20, 2024

బాలయ్య షోలో తొలి గెస్ట్ ఆయనే!

టాలీవుడ్ హీరోలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పై కొత్త కొత్త షోలతో మెరుస్తున్నారు. ఈ క్రమంలో హీరో నంమూరి బాల‌కృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆహా కోసం అన్‌ స్టాప‌బుల్ అనే షోని బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్నారు. ఈ షో నవంబర్ 4 నుండి ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ‌చ్చే తొలి గెస్ట్ ఎవ‌వరు వస్తున్నారు అన్న చర్చ సాగింది. అయితే ఇప్పుడు ఆ షోలో పాల్గొనే తొలి గెస్ట్ ఎవరు అన్న న్యూస్ బయటికొచ్చింది.

బాలయ్య షోలో తొలి గెస్ట్ గా నటుడు మంచు మోహన్ బాబు రానున్నారు. బాలయ్యతో కలిసి ఉన్న మోహన్ బాబు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ షో ఎలా ఉంటుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Telangana: టీకా తీసుకోకుంటే.. రేషన్, పెన్షన్ కట్

Advertisement

తాజా వార్తలు

Advertisement