Friday, March 29, 2024

‘మా’ కోసం మెగాస్టార్ ముందగుడు

మా అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికలలో పోటీ చేసే వారంతా కూడా పాత సమస్యలను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మా అసోసియేషన్ కు సంబంధించి భవనం విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి అందుకు ముందడుగు వేశారు. ఎన్నికల తంతు ముగిసిన తర్వాత మా కోసం భూమిని కేటాయించాలని కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడానికి ప్లాన్ చేస్తున్నాడట.

ప్రభుత్వం ఒకవేళ అందుకు సిద్ధంగా లేకపోతే ఓ కమిటీని ఏర్పాటు చేసి మా భవన నిర్మాణానికి నిధులు వసూలు చేయాలని నిర్ణయించారట మెగాస్టార్. ఇక ఇప్పటికే మోహన్ బాబు భూమి కోసం 25 శాతం నిధులు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. మిగిలిన 75 శాతం వసూలు చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట. అలాగే ఆ భూమిలో తన సొంత ఖర్చులతో బిల్డింగ్ నిర్మించాలని ఆలోచిస్తున్నాడట మెగాస్టార్. మరి చూడాలి మెగాస్టార్ ఆలోచనలు ఎంత వరకు ముందుకు వెళతాయో.

జిగేలు రాణి సాంగ్ కి అదిరిపోయేలా డాన్స్ వేసిన జపాన్ జంట

Advertisement

తాజా వార్తలు

Advertisement