Tuesday, March 26, 2024

బాలుని తలుచుకుని ఎమోషనల్ అయిన చిరు !!

గాన గంధర్వుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం 75 వ జయంతి నేడు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు బాలసుబ్రహ్మణ్యం ను తలచుకుంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం శారీరకంగా దూరమైనప్పటికీ…. ఆయన పాటలు ఎప్పుడు అందరితో కలిసి ఉంటాయని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా బాలు తో ఉన్న బంధం గురించి వీడియోను పోస్ట్ చేశారు. బాలు గారు అంటూ మర్యాదగా పిలిచి నన్ను దూరం చేస్తున్నావా అన్నారు. మీ ఔన్నత్యం తెలిశాక మీలాంటి వారిని ఏక వచనంతో సంబోధించడం సరికాదు అనుకుంటున్నానని చెప్పడంతో అలా పిలిచి నన్ను దూరం చేయకయ్య అన్నారు. కానీ ఇవాళ మనందరికీ అన్యాయం చేసి ఆయన దూరమయ్యారు అంటూ ఉద్వేగానికి లోనవుతూ వీడియో ని పోస్ట్ చేశారు చిరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement