Thursday, April 25, 2024

కరోనా తో మరో చిరు వీరాభిమాని మృతి

కరోనా మహమ్మారి ఎంతోమందిని మింగేస్తోంది. చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా పొట్టన పెట్టుకుంటోంది. అయితే తాజాగా చిరంజీవి వీరాభిమాని ఎర్ర నాగబాబు కరోనాతో మృతి చెందారు. ఇక ఇదే విషయమై చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. తన పిలుపు మేరకు ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేసి తాను గర్వపడేలా నాగబాబు చేశాడని అన్నారు. తమ ఐ బ్యాంకు ను ఆదర్శంగా తీసుకుని కోనసీమ లో ఐ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడని చూపు కోల్పోయిన ఎంతోమందికి చూపును తిరిగి తీసుకు వచ్చారని అన్నారు.

అంత మంచి మనిషి కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని… కొన్ని రోజుల క్రితం తను ఆయనతో మాట్లాడానని దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారన్నారు మెగాస్టార్. మిస్ యు నాగబాబు అంటూ చెప్పుకొచ్చారు చిరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement