Thursday, April 18, 2024

#PKSTD | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మెగా హీరోల మల్టీస్టారర్..

సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకున్న “వినోదయ సిత్తం” కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక మూవీని జులై 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement