Friday, April 26, 2024

బాలయ్య ఆగమనం.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌ విధ్వంసం..

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “వీర సింహా రెడ్డి”. ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే ఈరోజు ఈ మాసివ్ అనౌన్సమెంట్ ని ఇస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టుగా బాలయ్య పవర్ ఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేసారు. దీనితో వీరసింహా రెడ్డి మాస్ ఆగమనానికి సమయం ఫిక్స్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement