Sunday, March 24, 2024

పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ పై మరోసారి కూర్చున్న మారుతి ?

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశికన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపీచంద్ 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ కారణంగా సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది.

కాగా డైరెక్టర్ మారుతి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ పై మరోసారి కూర్చున్నాడట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మారుతి ప్రతి రోజు పండగే చిత్రంతో హిట్ ని అందుకున్నాడు. మరోవైపు గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిటీ మార్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement