Thursday, March 28, 2024

మిస్ట‌ర్ బ్ర‌హ్మ‌…ఏంటీ ఈ డ్రామా….

మేఘాంశ్‌ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’. జి. భవానీ శంకర్‌ దర్శకుడు. సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. హీరో మంచు మనోజ్‌ అతిథిగా విచ్చేసి క్లాప్‌ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్‌, బాబీ కొల్లి , చోటా కె నాయుడు -టైటిల్‌ పోస్టర్‌ లాంచ్‌ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చిత్ర యూనిట్‌కు శుభాశిస్సులు అందించారు. హీరో మేఘాంశ్‌ శ్రీహరి మాట్లాడుతూ దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. మా నిర్మాత చాలా గొప్ప సపోర్ట్‌ ఇచ్చారు. గోపిసుందర్‌, రామ్‌ ప్రసాద్‌ గారు -టె-క్నిషియన్స్‌ ఈ చిత్రానికి పని చేయడం ఆనందంగా వుంది. అన్నారు. దర్శకుడు భవానీ శంకర్‌ మాట్లాడుతూ ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్‌, ఫుల్‌ ఎంటర్‌ -టైనర్‌ చిత్రం అని చెప్పారు.


గోపి సుందర్‌ మాట్లాడుతూ.. దర్శకుడు భవానీ చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో ఆరు పాటలు వుం టాయన్నారు. రియా సచ్‌దేవ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ లో చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. మీ అందరి సపోర్ట్‌ కావాలి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ కథపై నమ్మకంతో ఎక్కడా నిర్మిస్తున్నాం అన్నా రు. ఈ చిత్రంలో మేఘాంశ్‌ శ్రీహరి, రియా సచ్‌దేవ, పోసాని కృష్ణ మురళి, సునీల్‌, హర్ష వర్ధన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నెల్లూరు సుదర్శన్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement