Tuesday, April 23, 2024

1000 కుటుంబాలకు అండగా మంచు లక్ష్మీ !!

కరోనా మహమ్మారి కారణంగా వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తినటానికి తిండి కూడా దొరక్క ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికోసం కొంత మంది సినీ ప్రముఖులు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి కూడా కొన్ని కుటుంబాలకు అండగా నిలిచారు. ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు మంచు లక్ష్మి. అందరికీ నమస్కారం… ఈ కరోనా కష్ట కాలంలో నేను వ్య‌క్తిగ‌తంగా హాస్పిట‌ల్స్‌ లో బెడ్స్‌ను ఏర్పాటు చేసి, మందుల‌ను అందించ‌డం లాంటి సేవ కార్యక్రమాల్లో భాగం అయ్యాను.

ఇప్పుడు టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరింత సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కరోనా చాలా కుటుంబాలను నాశనం చేసిందని మనకు తెలుసు. కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది బిడ్డలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. అందులో వెయ్యి పేద కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాల్లోని పిల్లలకు సరైన విద్య మంచి వైద్యంతో పాటు వారి అవసరాలకు కావలసిన ఇతర ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలని నిర్ణయించుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి.

Advertisement

తాజా వార్తలు

Advertisement