Saturday, April 20, 2024

కరోనా పై పోరాటానికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విరాళం

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది పేద ప్రజలు సినీ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సినీ స్టార్ తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు చాలా మంది సినీ హీరోస్ విరాళం ప్రకటించారు.

తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా తన వంతు గా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇచ్చారు. 25 లక్షల రూపాయలను తనవంతుగా విరాళం అందించారు. ముఖ్యమంత్రిని సెక్రటేరియట్ వద్ద కలిసి విరాళం సమర్పించారు. ఇప్పటికే రజినీకాంత్, సూర్య, అజిత్, జయం రవి తో పాటు పలువురు స్టార్ హీరోలు విరాళాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement