Monday, March 25, 2024

చివరి దశలో చేరుకున్న అడవిశేషు ‘మేజర్’

అడవి శేషు హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ముంబై ఉగ్రదాడుల లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేజర్ సందీప్ గా అడవి శేషు కనిపించబోతున్నారు. అలాగే సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే చాలా భాగము షూటింగ్ ను జరుపుకోగా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తుండగా విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement