Thursday, April 25, 2024

రేపు ‘మేజర్’ అనౌన్స్ మెంట్ !!

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో అడవి శేషు సరసన శోభితా ధూళిపాళ, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 2న రిలీజ్ కానుంది.

కాగా సోమవారం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా మేజర్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక అభిమానులంతా ఆ మేజర్ అనౌన్స్ మెంట్ ఏంటో అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ఎస్ మూవీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement