Friday, April 26, 2024

వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ విలన్

ఎస్ జే సూర్య గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. దర్శకుడిగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సూర్య. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి సినిమా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల మహేష్ బాబు స్పైడర్ సినిమా లో విలన్ గా నటించి మెప్పించాడు.

అయితే ఎస్.జె.సూర్య ఇప్పుడు థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. జూలై 18 నుంచి తమిళనాడులోని నాగర్ కోయిల్, చెన్నైలో ఈ షూటింగ్ మొదలు పెట్టనున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు పుష్కర్ గాయత్రి నిర్మిస్తుండటం విశేషం.ఇక ఈ సిరీస్ ను అమెజాన్ లో స్ట్రీమ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఎస్.జె.సూర్య ఏమేర ఈ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement