Friday, March 29, 2024

ఆర్ ఆర్ ఆర్ నిర్మాతతోనే….మహేష్ ప్రశాంత్ ల సినిమా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడు. అయితే ఇటీవల ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది.

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదిలా ఉండగా మహేష్ తో చేయబోయే సినిమాను ఆర్ ఆర్ ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నారట. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడట దానయ్య. భరత్ అనే నేను తర్వాత మహేష్ తో మరో సినిమాకు కమిట్ మెంట్ ఉండడంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ చేయడానికి దానయ్య ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement