Tuesday, April 23, 2024

సర్కారు వారి పాట టీం కోసం… మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకున్న సమయంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జూలై నుంచి షూట్ ను మళ్ళీ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా మహేష్ మాత్రం చిత్ర యూనిట్ వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయించాలి అని డిసైడ్ అయ్యారట. ఇక ఇటీవలే తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం వాసులకు మహేష్ వ్యాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement