Friday, March 29, 2024

సర్కారు వారి పాట సినిమాకు తప్పట్లేదు !!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. దీంతో షూటింగ్ ను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా తగ్గుతున్న కారణంగా ఇటీవలే ఈ షెడ్యూల్ ను ప్రారంభించారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా… ఇప్పుడు మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా స్పందించింది.ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement