Friday, April 26, 2024

ప్రశాంత్ నీల్ తో మహేష్ బాబు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే మహేష్ బాబు వీటితో పాటు మరో ప్రాజెక్ట్ మహేష్ బాబు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది మరెవరో కాదు. కేజిఎఫ్ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుందట.

గతంలో మహేష్ కూడా ఆ నిర్మాణ సంస్థ తో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement