Thursday, April 25, 2024

‘సర్కారు వారి పాట’ రెండో షెడ్యూల్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ . ఉగాది సందర్భంగా చిత్రం రెండో షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. ఉగాది రోజున రెండో షెడ్యూల్ షురూ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యలో అన్ని జాగ్రత్త చర్యలతో షూటింగ్ జరుపుతున్నట్టు తెలిపింది. ఈ షెడ్యూల్ లో హీరో మహేశ్ బాబు కూడా సెట్స్ పై అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఇంతకుముందు దుబాయ్ లో ‘సర్కారు వారి పాట’ తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది..రెండో షెడ్యూల్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్న చిత్రబృందం… ఆపై ప్రధాన షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement