Friday, March 29, 2024

ఫ్యాన్స్ తో ఒప్పందం ఉంది… థియేటర్స్ లోనే కలుస్తా !!

కరోనా కారణంగా చాలావరకు సినిమాలు ఓటీటీ బాట బాటపడుతున్నాయి. అదే పెద్ద సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ ని వెనక్కి వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటీటీ పై తన అభిప్రాయాన్ని తెలియచేశారు. తన సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు చేస్తున్నామని… థియేటర్లో నుండి ప్రేక్షకులని తన అభిమానులను వేరు చేయలేను అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

కానీ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి రెస్పెక్ట్ ఇస్తా అని చెప్పుకొచ్చారు. అది ఒక ప్రత్యేక సంస్థ అని అన్నారు. థియేటర్లలో తన అభిమానులను కలుస్తాను అని మాకు ఒప్పందం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement