Thursday, April 25, 2024

మహేష్ ప్లాన్ చేంజ్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను చిత్ర యూనిట్ కంప్లీట్ చేసింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు మరో సినిమా ను ఓకే చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు మొదట సర్కారు వారి పాట సినిమా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని అనుకున్నారట. కానీ కరోనా కారణంగా టైం గ్యాప్ ఎక్కువ అవుతుంది. దీనితో మహేష్ రెండు సినిమాలను ఒకేసారి కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. కాస్త అటు ఇటు అయినా ఈ రెండు సినిమాలు షూటింగ్ లలో ఏకకాలంలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement