Thursday, March 28, 2024

మహేష్, ఎన్టీఆర్ బొమ్మ అదిరింది కదూ..

జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఎన్టీఆర్ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఈ షో ఎపిసోడ్‌కి సినీ సెలెబ్రిటీలు కూడా రావడంతో టీఆర్పీ రేటింగ్ లోను దూసుకుపోతోంది. ఇదివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి వచ్చి ఎంటెర్టైన్మెంట్ చేయగా.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షోలో కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నారు. కాగా దీనికి సంబంధించిన షూటింగ్‌లో మహేష్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. పండుగ రోజు ఇద్దరు హీరోలు కలిసి బుల్లితెర మీద సందడి చెయ్యనుండడంతో ఈ స్పెషల్ ఎపిసోడ్‌పై హైప్ క్రియేట్ అయింది. ఇంతకుముందు మహేష్ ‘భరత్ అనే నేను’ ఫంక్షన్‌కి తారక్ గెస్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ షో కర్టెన్ రైజర్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: కనికరించండి..మాపై ప్రత్యేక దృష్టి పెట్టండి: చిరంజీవి

Advertisement

తాజా వార్తలు

Advertisement