Tuesday, April 23, 2024

“మహా సముద్రం” నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్..

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, అదితి రావు హైదరి హీరో హిరోయిన్లు గా నటిస్తున్న మూవీ ‘మహాసముద్రం’. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్‌ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్‌ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కాగా “మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సిద్ధార్థ్ .. అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video

ఇది కూడా చదవండి: గ్రీన్ క‌ల‌ర్స్‌ లో మిల్కీ బ్యూటీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement