Saturday, April 20, 2024

మానాడు రీమేక్ హక్కులు.. ద‌క్కించుకున్న సురేశ్ ప్రొడక్షన్స్..

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఈ సంస్థ నిర్మిస్తున్న కొన్ని సినిమాల నిర్మాణం చివరి దశలో ఉండగా ఇంకొన్ని పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో విజయం సాధించిన ‘మానాడు’ సినిమా తెలుగు డబ్బింగ్‌ హక్కులతో పాటు అన్ని భాషల రీమేక్‌ హక్కులను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్‌ సినిమాకు ఏసియన్‌ సినిమాస్‌ కూడా భాగస్వామ్యం వహించనుంది.

‘మానాడు’లో శింబు, కళ్యాణి ప్రియదర్శన్‌ హీరో హీరోయిన్లుగా ఎస్‌ జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ సై ఫై థ్రిల్లర్‌ను వెంకట్‌ ప్రభు తెరకెక్కించాడు. సురేష్‌ కామాక్షి నిర్మించిన ఈ సినిమా గత ఏడాది నవంబర్‌ 25న విడుదలైంది. 2021లో అత్యధిక గ్రాస్‌ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు నెలకొల్పింది. మానాడును మిగతా భాషల్లో సురేష్‌ ప్రొడక్షన్‌ రీమేక్‌ చేయనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement