Wednesday, April 24, 2024

మహేష్‌ విడుదల చేసిన ‘ఏవో ఏవేవో కలలే’ సాంగ్

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి మరో పాట గురువారం ఉదయం విడుదలైంది. ‘ఏవో ఏవేవో కలలే’ అంటూ సాగే ఈ పాటను ప్రిన్స్ మహేష్‌బాబు విడుదల చేశాడు. శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫిదా’ సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘లవ్ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘సారంగ దరియా’ సాంగ్ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచింది. ఇప్పటికే యూట్యూబ్‌లో ఆ పాట 75 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించింది. తాజాగా మహేష్ బాబు రిలీజ్ చేసిన మెలోడి సాంగ్ ‘ఏవో ఏవో కలలే’, సాంగ్ మరింతగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేదిగా ఉంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా పవన్ సీహెచ్ సంగీతం అందించాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించగా జోనిత గాంధీ, నకుల్ అభయంకర్ ఆలపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement