Tuesday, March 19, 2024

దిల్ రాజు కు కరోనా – ఎంతమందిని కలిసారో తెలుసా ?

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కాగా ఇటీవల కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మంది సినీ స్టార్స్ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో నటించిన హీరోయిన్ నివేద థామస్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా … ఇప్పుడు దిల్ రాజు కు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి సంబంధించిన ఉద్యోగులతో పాటు దిల్ రాజు ను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఇక ఇటీవల కాలంలో దిల్ రాజు వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా వకీల్ సాబ్ యూనిట్ ని, ఆడియన్స్ ని, డిస్ట్రిబ్యూటర్ల ను, అలాగే మెగాస్టార్ చిరంజీవి ని కూడా కలిశారు. దీంతో వారంతా కూడా ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. అలాగే తనను కలిసిన వారంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు హోమ్ ఐసోలాషన్ లోకి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement