Friday, March 29, 2024

ఆదిపురుష్ మూవీపై లేటెస్ట్ అప్డేట్

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు ఆది పురుష్, సలార్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ బయటికి వచ్చింది.

షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నడట. ప్రభాస్ కృతిసనన్ లపై సన్నివేశాలను కూడా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారట. మరి కొన్ని రోజుల పాటు వీరిపై కీలక సన్నివేశాలను తీయబోతున్నట్లు తెలుస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా సీతగా కృతిసనన్ కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement