Thursday, April 25, 2024

స్థల వివాదం.. కోర్టు మెట్లెక్కిన హీరో దగ్గుబాటి రానా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓ స్థల వివాదంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా కోర్టు మెట్లెక్కాడు. ఒక వ్యక్తి తనను దగ్గుబాటి కుటుంబం మోసం చేసిందంటూ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. జూబ్లిహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో దగ్గుబాటి వెంకటేశ్‌, దగ్గుబాటి సురేష్‌బాబుల పేరున 2,220 గజాల స్థలం ఉంది. గత కొన్నేళ్ల నుంచి ఈ స్థలాన్ని ఒక వ్యక్తికి దగ్గుబాటి కుటుంబం లీజుకు ఇచ్చింది.

లీజు గడువు ముగియక ముందే దగ్గుబాటి కుటుంబం తన ఇచ్చిన స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తోందని, తనకు తెలియకుండా ఈ స్థలంలోని వెయ్యి గజాలను రానా పేరు మీద రిజిస్టర్‌ చేసినట్టు సదరు వ్యక్తి సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు రానాను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో మంగళవారం రానా కోర్టుకు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement