Thursday, April 25, 2024

షూట్ షురూ…@ ఆడవాళ్ళు మీకు జోహార్లు

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

మార్చి 6న శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. అయితే కరోనా కారణంగా స్టార్ట్ కాలేదు. కానీ నేడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో రష్మిక మందన్న, శర్వానంద్, డైరెక్టర్ కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement