Thursday, April 25, 2024

సుస్మిత నిర్మాణంలో కృతిశెట్టి..

మెగాస్టార్ చిరంజీవి కుమారై సుస్మిత సొంత బ్యాన‌ర్ ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. ఆ బ్యాన‌ర్ పై సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో సన్నాహాలు మొదలుపెట్టింది. నాయిక ప్రధానమైన ఒక కథను ఎంపిక చేసుకున్న ఆమె, ప్రధాన పాత్ర కోసం కృతి శెట్టిని అనుకుందట. కృతి శెట్టి కథ వినడం .. ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. జీ స్టూడియోస్ తో కలిసి సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తుందట. ఉప్పెన’ సినిమాతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ సినిమాలు ఉన్నాయి. ఇక చర్చల దశలో చాలానే ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాని సరసన ఆమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ వచ్చేనెలలో విడుదల కానుంది. రామ్ .. నితిన్ .. చైతూ .. సుధీర్ బాబులతో ఆమె చేస్తున్న సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో కూడా ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండటం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement