Friday, March 29, 2024

ఆదిపురుష్ కోసం వెయిట్ చేస్తున్న కృతిసనన్

రామాయణం ఆధారంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఇక సీతగా కృతిసనన్ కనిపించనుంది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో హీరోయిన్ కృతిసనన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె చాట్ చేస్తూ.

ఆదిపురుష్ పై చాలా ఎగ్జైట్ అవుతున్నా అని చెప్పుకొచ్చారు. సరికొత్త ఎక్స్ పీరియన్స్ డిఫరెంట్ గా ఫీలవుతున్నానని ప్రతి అంశం కూడా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా కోసం కృతి శెట్టి ఎంతగా ఎదురు చూస్తుందో ఆమె మాటల్ని చూస్తే అర్థం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement