Friday, April 26, 2024

చిరు ఫ్యాన్స్ కి ఆలస్యమైంది…. ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో మాత్రం అలా జరగదట!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నారు. అయితే ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. అలాగే ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు కొరటాల. కాగా ఎన్టీఆర్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కొట్టాల.

ఆచార్య పూర్తి చేసే సమయానికి ఎన్టీఆర్ రాజమౌళి సినిమా నుంచి బయటికి వస్తాడు. అయితే ముందుగా ప్రీప్రొడక్షన్ కోసం ఇంత సమయం, ప్రొడక్షన్ కోసం ఇంత సమయం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం మరికొంత సమయం అని పక్కా ప్రణాళికలు రెడీ చేసుకున్నాడట కొరటాల. ఆ ప్రకారమే సినిమాని కూడా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్టీఆర్ సినిమా ను ఆలస్యం చేయకూడదని ఫిక్స్ అయ్యాడట. ఆచార్య విషయంలో జరిగిన పొరపాటు ఈ సినిమాలో జరగకూడదని భావిస్తున్నాడట. మరి కొరటాల ఆలోచనలు ఎంత వరకు ముందుకు వెళ్తాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement