Friday, April 19, 2024

టైటిల్ మార్చేస్తున్నాం…కోన వెంకట్

రౌడీ బేబీ టైటిల్ ను మార్చుతున్నట్లు రచయిత, నిర్మాత కోనవెంకట్ తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, అయితే కొత్త టైటిల్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని తెలిపారు. కొన్ని మార్పులు ఆహ్లాదకరంగా ఎంతో బాగుంటాయని మేము వెల్లడించే ఉద్విగ్నభరితమైన కొత్త టైటిల్ కోసం వేచి చూడండి.

అలాగే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అంటూ కోనవెంకట్ చెప్పుకొచ్చారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం వివి బ్యానర్ పై కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో సందీప్ కిషన్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement